Fawad Chaudhry That Defeat Modi : లోక్సభ ఎన్నికల 2024 (Lok Sabha Elections 2024) చివరి దశ ఓటింగ్ (Voting) జూన్ 1న జరగనుంది. కాగా, రాహుల్ గాంధీ (Rahul Gandhi), అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ను ప్రశంసించిన పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ‘మోదీ (Modi) ని ఓడించండి’ అని బహిరంగ పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల మధ్యలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ తుఫాను సృష్టించాయి. మాట్లాడుతూ పాకిస్తాన్లోని ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వడం ద్వారా నరేంద్ర మోడీని ఓడించాలని కోరుకుంటున్నానంటూ ఫవాద్ చౌదరి అన్నారు. వార్తా సంస్థ IANS కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ నాయకుడు ఫవాద్ మాట్లాడుతూ, “ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓటమి అవసరం. భారతదేశం – పాకిస్తాన్ రెండుచోట్లా తీవ్రవాదం ఓడిపోయినప్పుడు మాత్రమే భారతదేశం – పాకిస్తాన్ సంబంధాలు మెరుగవవుతాయి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Fawad Chaudhry : మోదీని ఓడించండి.. పాక్ మాజీ మంత్రి బహిరంగ పిలుపు
లోక్సభ ఎన్నికలలో మోదీని ఓడించాలంటూ పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి బహిరంగంగా పిలుపునిచ్చారు. భారత్ లో రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కేజ్రీవాల్, రాహుల్ గాంధీలను ప్రశంసించిన ఆయన మోదీ, బీజేపీలను తీవ్రంగా దుయ్యబట్టారు.
Translate this News: