Uttar Pradesh Seats: కేంద్రంలో అధికారం దక్కాలంటే.. ఉత్తరప్రదేశ్ ను గెలవాలి. ఇది దేశ రాజకీయాల్లో చెప్పుకునే మాట. అది నిజం కూడాను. ఎందుకంటే, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా యూపీలో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 545 సీట్లలో 80 సీట్ల వాటా కలిగి ఉండడం అంటే అది కచ్చితంగా పార్టీల తలరాతలు మార్చే నెంబరే కదా. ఇక పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుండి ఇందిరా గాంధీ వరకు, అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నరేంద్ర మోడీ వరకూ అందరూ యుపి నుండి గెలిచి ప్రధానులు అయ్యారు. అందుకే యూపీ ఎంపీ సీట్లు ఏ పార్టీకైనా.. ఏ కూటమికైనా చాలా ముఖ్యమైనవి. ఈ సీట్ల గెలుపోటములు మొత్తం రాజకీయాల లెక్కలు మార్చేస్తాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి.. కాంగ్రెస్ ఇండియా కూటమి ఆమీ తూమీ తేల్చుకుంటున్నాయి. వరుసగా రెండుసార్లు ప్రధాని మోదీ నాయకత్వంలో విజయకేతనం ఎగురవేసిన ఎన్డీఏ కూటమి.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇక కాంగ్రెస్ ఇండియా కూటమి ఎలాగైనా ఈసారి గెలిచి ఢిల్లీ గద్దె అందుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది.
పూర్తిగా చదవండి..Uttar Pradesh Seats: యూపీలో పార్టీల హార్ట్ బీట్ పెంచుతున్న ఆ సీట్లు.. తేడా వస్తే అంతే!
కేంద్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీ అయినా యూపీలో చక్రం తిప్పాలి. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. కానీ, ఇక్కడ 31 సీట్లు మాత్రం ఎన్డీయే-ఇండియా కూటమి మధ్యలో నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. ఎందుకలా? తెలియాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే
Translate this News: