మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. మాచర్లకు వెళ్లవద్దని కండిషన్ పెట్టింది. అయితే.. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో వచ్చే నెల అరు వరకు ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆరోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొంది. ఇంకా సాక్షులతో కూడా మాట్లాడేందుకు వీలులేదని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు.
పూర్తిగా చదవండి..మాచర్ల వెళ్లొద్దు.. వారితో మాట్లాడొద్దు: పిన్నెల్లికి హైకోర్టు కండిషన్లు
జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటి వరకు మాచర్లకు వెళ్లొద్దని ఆయనపై ఆంక్షలు విధించింది న్యాయస్థానం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొంది.
Translate this News: