ఇటీవల దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ‘ ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో మరణ హోమం జరిగింది. 5 నెలల్లో 27 ఎన్ కౌంటర్లు,18 ఫేక్ ఎన్ కౌంటర్లు జరిగాయి. 107 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 45 మంది వరకు సాధారణ పౌరులే ఉన్నారు. చర్చలకు సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
పూర్తిగా చదవండి..Maoist: సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట సంచలన లేఖ విడుదల చేశారు.ప్రధాని మోదీ, అమిత్ షా, విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ మరణహోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ హెచ్చరించారు.
Translate this News: