Political Family War : సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే మే నెలలో నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన పాదయాత్ర నంద్యాల(Nandyala) కు చేరుకుంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ(TDP) నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సందడిగా ఆయన పాదయాత్ర సాగుతున్న వేళ.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) వర్గీయులు సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి(AV Subba Reddy) టార్గెట్ గా దాడికి దిగారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. రక్తం వచ్చేలా కొట్టారు. అఖిల ప్రియ సైతం ఆ దాడిలో పాల్గొన్నారు. ప్రత్యర్థులపైకి పరిగెత్తుతూ ఆమె వార్నింగ్ ఇస్తున్న దృష్యాలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి. ఈ విషయమై భూమా అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు నంద్యాల పోలీసులు.
Bhuma Akhila-AV Subba Reddy : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?
ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిల ప్రియకు ఉన్న విభేదాల కారణంగానే.. ఆమె బాడీ గార్డుపై ఈ రోజు హత్యయత్నం జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భూమ అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ఎప్పుడు, ఎందుకు ప్రారంభం అయ్యాయో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: