నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దామోదర్ రెడ్డికి భార్య సులోచన, కొడుకు సుభాష్చంద్రారెడ్డి, కుమార్తె ఝాన్సీలక్ష్మీ ఉన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా పీఏపల్లికి మండలం అజ్మాపురానికి చెందిన దామోదర్ రెడ్డి.. 1980లో నల్గొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
పూర్తిగా చదవండి..Nalgonda: నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత
నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
Translate this News: