Political Murder : ఏపీ(AP)లోని శ్రీకాకులం జిల్లా(Srikakulam District) రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో దారుణం జరిగింది. బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య(Murder) చేయడం కలకలం రేపింది. ఇటీవలే సంగాం.. కోర్టు గుమస్తాగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. అయితే దీన్ని రాజకీయ హత్యగా మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కరెంట్ కట్ చేసి మరీ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే సంగాం టీడీపీ(TDP)లో కీలక పాత్ర పోషిస్తున్నారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో దారుణం.. పొలిటికల్ మర్డర్!
శ్రీకాకులం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేయడం కలకలం రేపింది. దీన్ని రాజకీయ హత్యగా మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. సంగాం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
Translate this News: