Station Master: అది ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా దగ్గరలోని ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్. అర్ధరాత్రి. పాట్నా-కోటా ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఆగింది. నిజానికి ఆ ట్రైన్ కు అక్కడ హాల్ట్ లేదు. సిగ్నల్ లేకపోవడంతో రైలు ఆగింది. ఐదు.. పది.. పదిహేను.. ఇరవై నిమిషాలు గడుస్తున్నాయి. అరగంట పూర్తి అయిపోయింది. ట్రైన్ పైలట్ సిగ్నల్(Station Master) కోసం హారన్ కొడుతూనే ఉన్నాడు. కానీ, సిగ్నల్ ఇవ్వడం లేదు. దీంతో ఆ ట్రైన్ లోని ప్రయాణీకులకు విసుగు వచ్చింది. రైలు ఇంకెంత సేపు ఆగుతుంది? అంటూ చికాకు పడటం మొదలైంది. గార్డ్ కు కూడా అనుమానం వచ్చింది. ఎందుకు ఇంత సేపు సిగ్నల్ లేదు అని లోకో పైలెట్ తో మాట్లాడి.. స్టేషన్ లోకి వెళ్లి చూశారు. అక్కడి పరిస్థితి చూసి పైలట్, గార్డులకు మతిపోయింది. అక్కడ ద్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. దీంతో అవాక్కయిన రైలు సిబ్బంది సదరు స్టేషన్ మాస్టార్ని నిద్రలేపి.. సిగ్నల్(Station Master) ఇవ్వు స్వామీ అని చెప్పి.. వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..Station Master: అర్ధరాత్రి అరగంటకు పైగా నిలిచిపోయిన ఎక్స్ ప్రెస్..సిగ్నల్ ఇవ్వాల్సిన స్టేషన్ మాస్టర్ చేసిన పనికి పాసెంజర్స్ షాక్!
ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా దగ్గరలోని ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గుర్రు పెట్టి నిద్రపోవడంతో.. సిగ్నల్ ఇచ్చేవారు లేక పాట్నా-కోటా ఎక్స్ప్రెస్ రైలు దాదాపు అరగంటకు పైగా ఆగిపోయింది. దీంతో, ప్రయాణీకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Translate this News: