Houthi Rebels Attacks:యెమెన్ హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ మీద కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం శాంతించినా..హౌతీ రెబల్స్ మాత్రం తగ్గడం లేదు. ఎర్ర సముద్రంలో నూకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హిందూ మహాసముద్రం మీద కూడా అటాక్స్ పెంచేశారు. ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే అన్ని నౌకలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హిందూ మహాసముద్రంలో నాలుగు నౌకల మీద దాడులు చేశారు హౌతీ రెబల్స్. హిందూ మహా సముద్రంలో డ్రోన్ దాడులను ప్రారంభించామని.. MSC ఓరియన్ కంటైనర్ షిప్ను లక్ష్యంగా చేసుకున్నామని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు చెప్పారు. పోర్చుగీస్- ఫ్లాగ్ ఉన్న MSC ఓరియన్ పోర్చుగల్, ఒమన్ మధ్య పని చేస్తోంది.
పూర్తిగా చదవండి..International: హిందూ మహా సముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి
హిందూ మహా సముద్రం, ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్-హమాస్ వార్ మొదలైన దగ్గర నుంచి వారు అటాక్లు చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్న దేశాల నౌకలన్నింటి మీదా హౌతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు.
Translate this News: