ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బాఈమ్ ఈరోజు తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఆయన తన ఫామ్ను సమర్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి వెళ్ళారు. ఈరోజే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు అవడంతో కాంగ్రెస్ నేత ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీని తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. రీసెంట్గా సూరత్లో కాంగ్రెస్, ఇంకా ఇతర నాయకులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో అక్కడ బీజేపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నిక అయిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..National: సూరత్ తర్వాత ఇండోర్.. మరో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ.
సూరత్ తర్వాత మరో కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఇండోర్ నుంచి పోటీ చేస్తున్న అక్షయ్ బామ్ తన నామినేషన్ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీలో చేరేందుకే ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
Translate this News: