లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఏప్రిల్ 19న నిర్వహించిన మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయితే నాగలాండ్లో మాత్రం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని తూర్పున ఉన్న ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇందుకు కారణం తమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ రావడమే. ‘ఈస్టర్న్ నాగ్లాండ్ పీపుల్స్ సంస్థ'(ENPO) ఈ ఆరు జిల్లాలు ఉన్న ప్రాంతాన్ని ‘ఫ్రాంటీర్ నాగలాండ్ టెర్రిటరీ(FNT)గా ప్రకటించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న ఎన్నికల వేళ ఈ ఆరు జిల్లాల్లో బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఈ ఆరు జిల్లాల్లో ఉన్న 4 లక్షల మంది ఓటర్లలో కనీసం ఒక్కరూ కూడా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయ్యలేదు.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections: నాగలాండ్లోని ఆ ప్రాంతంలో సున్నా శాతం ఓటింగ్.. కారణం ?
ఏప్రిల్ 19న జరిగిన మొదటిదశ ఎన్నికలు జరగగా.. నాగలాండ్లోని తూర్పున ఉన్న ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కు వినయోగించుకోలేదు. తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంగా కేటాయించాలనే బంద్ పిలుపు మేరకు ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
Translate this News: