Elon Musk India Tour : భారత్(India) లో టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) పర్యటన వాయిదా పడింది. టెస్లా కార్ల తయారీ సంస్థకు చెందిన ముఖ్యమైన పనులు ఉండడం వల్లనే మస్క్ భారత్లో తన పర్యటన వాయిదా వేసుకున్నారని ఎక్స్లో వేదికగా వెల్లడించారు. మామూలుగా అయితే ఈనెల 21, 22 తేదీల్లో ఆయన ఇండియాకు రావాల్సి ఉంది. మన దేశంలో విద్యుత్ కార్ల(Electric Cars) తయారీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు యమస్క్ ఈ పర్యటనను పెట్టుకున్నారు. రెండు రోజుల పాటూ మస్క్ భారత్లో పర్యటించాలని అనుకున్నారు. ఇందులో ప్రధాని మోదీ(PM Modi) తో భేటీ కూడా ఉంది. దీని గురించి ప్రధాని మోదీ చెబుతూ.. మస్క్ భారత్కు మద్దతుదారు అని, పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం పలుకుతున్నామని, భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు.
పూర్తిగా చదవండి..Elon Musk : ఇప్పుడు రావడం లేదు.. భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
టెస్లా, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎక్స్లో అనౌన్స్ చేశారు. ఆయన ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడింది.
Translate this News: