CM Revanth:లోకసభ ఎన్నికల్లో తెలగాణ లో 15ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 10శాతంగా ఉన్న ముదిరాజ్ లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు బీసీ డీ నుంచి బీసీఏ గ్రూపులోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా..10ఏళ్లపాటు కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. మాదిగల వర్గీకరణ చేయాల్సిందేనని, వాళ్లకు న్యాయం జరిగాల్సిందే అన్నారు. భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
పూర్తిగా చదవండి..CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఆగస్టు 15 నాటికి..!
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రైతులకు రూ. 2లక్షల మేర రుణమాఫీ చేస్తామని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడారు. తెలంగాణలో 15ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తామన్నారు.
Translate this News: