JEE Advanced 2024: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు ఆన్లైన్లో అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. ఈ తేదీల్లో మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అయితేపరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన ప్రకారంగానే మే 26వ తేదీన యథాతథంగా పరీక్ష జరుగుతుందని తెలిపింది.
పూర్తిగా చదవండి..JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వాయిదా..కొత్త షెడ్యూల్ పూర్తి వివరాలివే.!
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఏప్రిల్ 27 నుండి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 21 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్ జరగాల్సింది.
Translate this News: