6000 Indian Workers to Israel: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) వల్ల ఇజ్రాయోల్ నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది అక్కడి ప్రభుత్వం. అందులో భాగంగానే భారత్ నుంచి 6వేల మంది కార్మికులు అక్కడి చేరుకున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్-మే మధ్యకాలంలో 6 వేల మంది భారతీయులు ఇజ్రాయెల్ వెళ్లినట్లు తెలిపింది.ఇజ్రాయెల్లో కార్మికుల కొరతను అధిగమించడానికి, ఏప్రిల్, మే నెలల్లో 6 వేల మందికి పైగా భారతీయ కార్మికులు ఇజ్రాయెల్ చేరుకోనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిర్మాణ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖల సంయుక్త నిర్ణయం మేరకు చార్టర్ విమానాలకు సబ్సిడీ ఇవ్వడానికి కార్మికులను ఎయిర్ షటిల్లలో ఇజ్రాయెల్కు తీసుకువస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆలస్యంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..Israel: ఇజ్రాయెల్ కు 6వేల మంది భారత కార్మికులు..ఎందుకీ తొందరపాటు నిర్ణయం?
ఇజ్రాయెల్ ను కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఏప్రిల్, మేలో భారత్ నుంచి పెద్దెత్తున కార్మికులు అక్కడికి వెళ్లనున్నట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది.
Translate this News: