Complaint On Radhakishan Rao : ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) నిందితుడు రాధాకిషన్రావు(Radhakishan Rao) మీద మరిన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వెనకు చాలానే నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. తాజాగా క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లో ఒకరైన వేణుమాధవ్..రాధాకిషన్రావు మీద కంప్లైంట్ చేశారు. తనను కిడ్నాప్ చేసి కోట్లు విలువైన షేర్లు బదిలీ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక్క రాధాకిషన్రావు మీదనే కాక మొత్తం టీమ్ మీద ఫిర్యాదు చేశారు. దీంతో రాధాకిషన్తోపాటు ఇన్స్పెక్టర్లు గట్టుమల్లు, మల్లికార్జున్ సహా 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Telangana : టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్రావుపై మరో కేసు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు మీద మరో కేసు నమోదు అయింది. కిడ్నాప్ చేసి కోట్లు విలువైన షేర్లు బదిలీ చేయించారని క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లో ఒకరైన వేణుమాధవ్ కంప్లైంట్ చేశారు.
Translate this News: