Pakistan : పాకిస్థాన్లోని గ్వాదర్ పోర్ట్(Gwadar Port) ప్రాంతం అనేది ఒకప్పుడు చేపలు పట్టేవారికి, వ్యాపారులకు ఓ చిన్న పట్టణంగా ఉండేది. ఈ చిన్న ప్రాంతమే.. ఇప్పుడు పాకిస్థాన్లోని మూడవ అతిపెద్ద పోర్టుగా ఉంది. అయితే ఈ గ్వాదార్ పోర్టు అనేది పాకిస్థాన్ది కాదు. 1950 వరకు దాదాపు 200 ఏళ్ల పాటు ఇది ఒమాన్ల పాలనలో ఉండేది. 1947లో భారత్(India) నుంచి పాకిస్థాన్ విడిపోయిన తర్వాత.. 1958లో పాకిస్థాన్ ఈ పోర్టును స్వాధీనం చేసుకుంది. కానీ అంతకుముందు ఈ ప్రాంతాన్ని భారత్కు ఇచ్చేందుకు ఒమాన్ సుల్తాన్(Oman Sultan) సిద్ధమయ్యాడు. కానీ ఇందుకు అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు.
పూర్తిగా చదవండి..Gwadar Port : పాకిస్థాన్లో ఉన్న గ్వాదర్ పోర్టు ఇండియాకు దక్కే ఛాన్స్ వచ్చింది.. కానీ
పాకిస్థాన్లోని బలుచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న గ్వాదర్ పోర్టును.. అప్పట్లో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఒమాన్ సుల్తాన్ భారత్కు అమ్మేందుకు ఆఫర్ ఇచ్చారు. కానీ పలు కారణాల వల్ల అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని తిరస్కరించారు.
Translate this News: