ఎండకాలం మొదలైపోయింది. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వేసవి కాలంలో కొందరు నదులు, చెరువులు,బీచ్లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట, దద్దుర్లు, నిరసం లాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటారు. మరీ ముఖ్యంగా కొందరు వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే వేసవిలో మన శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా.. హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో తగినన్ని నీళ్లు తీసుకోకుంటే.. మన శరీరంలోని పలు భాగాల పనితీరు మందగిస్తుందని చెబుతున్నారు. ఒక వ్యక్తి సగం బరువులో.. మూడింట రెండు వంతుల నీరు ఉంటుంది. ఒక 70 కిలోల వ్యక్తి శరీరంలో దాదాపు 42 లీటర్ల నీరు ఉంటుంది. అందుకే ఈ వేసవిలో శరీరానికి కూలింగ్ ఇచ్చే పండ్లరసాలు, ఆహారాన్ని తీసుకోవాలి.
పూర్తిగా చదవండి..World Health Day: వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి
వేసవి కాలంలో శరీరాన్ని డీహైడ్రేట్కు గురికాకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
Translate this News: