Lok Jana Shakthi Party : లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్నవేళ ఎన్డీయే(NDA) కూటమిలోని లోక్జనశక్తి పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan) నేతృత్వం ఉన్న పార్టీ నుంచి 22 మంది సీనియర్ నేతలు వెళ్ళిపోయారు. పార్టీకి రాజీనామా చేసి.. ఇండియా కూటమికి మద్దతుగా ఉంటామని మరీ ప్రకటించారు. వీరిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, బిహార్ మాజీ మంత్రి రేణు కుశ్వాహా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, రవీంద్ర సింగ్ వంటి కీలక నేతలు ఉన్నారు. నేతలంతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాజు తివారీకి రాజీనామా లేఖలు సమర్పించారు.
పూర్తిగా చదవండి..Bihar : బీజేపీ వద్దు… ఇండియాకే మద్దతంటున్న ఎల్జేపీ నేతలు
బీహార్లో ఎన్డీయే పార్టీకి షాక్ తగిలింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో లోక్జనశక్తి పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 22 మంది సీనియర్ నేతలు పార్టీని వెళ్ళిపోయారు. ఇక మీదట తమ మద్దతు ఇండియా కూటమికే అని ప్రకటించారు.
Translate this News: