Dowry Murder In Greater Noida : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) కి పక్కనే ఉన్న గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన జరిగింది. వరకట్ర వేధింపులతో తన భార్యను తానే చంపేశాడో భర్త. కట్నం కింద ఫార్చ్యునర్ కారు(Fortuner Car) ఇవ్వలేదని మహిళను భరత, అతని బంధువులు కలిసి చిత్రహింసలుకు గురి చేసి మరీ చంపేశారు. గ్రేటర్ నోయిడా(Greater Noida) లోని ఖాడా చౌగన్పూర్ అనే ప్రాంతంలో ఉంటున్న వికాస్కు కరిష్మితో 2022లో పెళ్లి అయింది. విమాహం సమయంలో కరిష్మా తల్లిదండ్రులు వికాస్కు 11 లక్షల కట్నం, ఒక ఎస్యూవీ ఇచ్చారు. కానీ అవి వికాస్కు, అతని తల్లిదండ్రులకు సరిపోలేదు. పెళ్ళి అయిన తర్వాత నుంచి అదనపు కట్నం(Additional Dowry) కోసం వేధిస్తూనే ఉన్నారు. అది చాలదు అన్నట్టు కరిష్మకు కొంతకాలం క్రితం ఆడపిల్ల పుట్టింది. దాంతో ఆమెకు మరింత వేధింపులు ఎక్కువయ్యాయి.
పూర్తిగా చదవండి..Delhi : ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని భార్యను చంపేసిన భర్త
ఏంటో మన దేశం...ముందుకు పరుగెడుతున్నామో...వెనక్కు వెళుతున్నామో తెలియడం లేదు. ఇంత అభివృద్ధి చెందుతున్నా...వరకట్నం వేధింపులు. చావులు మాత్రం ఆగడం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని ఓ భార్యని భర్త చంపేశాడు.
Translate this News: