Kachchatheevu Island : 1970లలో కాంగ్రెస్(Congress) కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక(Srilanka) కు ఇవ్వడం మీద ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఆ ద్వీపాన్ని శ్రీలంక వశం చేసుకోవడం మీద కాంగ్రెస్ చెప్పిన కథనాలను నమ్మలేమని ఆయన అన్నారు. కచ్చతీవును కాంగ్రెస్ ఎంత నిర్ద్వందంగా వదులుకుందో ఆ కథనాలు చెబుతాయని ఆయన అన్నారు. ఇవి వింటే లేదా చదదివితే ప్రతీ భారతీయుడికీ కోపం రాక మానదని అన్నారు మోదీ. కాంగ్రెస్ను ఎప్పటికీ నమ్మలేమని.. భారతదేశానికి(India) నష్టం కలిగించే ఇలాంటి పనులు ఎన్నో చేసిందని చెప్పుకొచ్చారు. భారతదేశ ఐక్యతను దెబ్బ తీసే విధమైన నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నో తీసుకుందని ఆరోపించారు మోదీ. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీని మీద మోదీ ఎక్స్లో పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..PM Modi : కచ్చతీవు ద్వీపం మీద ప్రధాని మోదీ విమర్శలు.. కాంగ్రెస్ను నమ్మలేనని వ్యాఖ్యలు
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు కాంగ్రెస్ నిస్సంకోచంగా ఇచ్చిందనే వాస్తవాలు భారతీయులు ఎప్పటికీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఇది ప్రతీ భారతీయుడికీ కోపం తెప్పించే విషయమని అన్నారు.
Translate this News: