Baltimore Bridge Accident: అమెరికాలోని బాల్టిమోర్లో పటాప్ స్కో నదిపై రవాణా సరుకు నౌక వంతెనను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ వంతెన సెకండ్లలోనే కుప్పకూలింది. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆ నౌకలో ఉన్న భారత సిబ్బందిపై, అలాగే సహాయక సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ‘నదిలో వెళ్తుండగా.. షిప్ నియంత్రణ కోల్పోయింది. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే స్పందింది.. మేరీలాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటికి సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక అధికారులు ఆ వంతెన రాకపోకలను నిలిపివేయగలిగారు. వీళ్ల అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని’ జో బైడెన్ అన్నారు.
పూర్తిగా చదవండి..Joe Biden: వంతెన ప్రమాదం ఘటన.. భారత సిబ్బందిని ప్రశంసించిన బైడెన్
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెన కూలిన ప్రమాదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురించారు. సిబ్బంది అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని అన్నారు. మళ్లీ ఆ వంతెనను నిర్మిస్తామని తెలిపారు.
Translate this News: