Airtel, Jio to Hike Tariffs: Airtel, Jio ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఖరీదైనవిగా మారనున్నాయి. లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత, వినియోగదారులు మొబైల్ రీఛార్జ్ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దిగ్గజ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ వ్యూహాలను ఇప్పటికే రెడీ చేసుకుంటున్నాయి. తమ ప్లాన్ ధరలను పెంచడం ద్వారా ఒక వినియోగదారుని వచ్చే సగటు ఆదాయం పెంచుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తుంది. మరోవైపు ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగాన్ని మరింత పెంచి దీనితో అధికధరలు గల ప్యాకేజీల వైపు కస్టమర్లను మళ్లించాలనేది జియో (JIO) ప్లాన్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Airtel, Jio కస్టమర్లకు షాక్.. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
దేశ టెలికాం కంపెనీల్లో రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. జియో వచ్చాక, ఎయిర్ టెల్ హవా తగ్గింది. అయితే ఇప్పుడు ఎయిర్ టెల్..టెలికాం ఛార్జీల ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది.జియో మాత్రం మరోకొత్త పంథాలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Translate this News: