Ex. Minister Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు.. రైతుల(Farmers) కోసమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు(Ex. Minister Harish Rao). చేరికల కోసం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్తున్న ముఖ్యమంత్రి..రైతులకు చనిపోతుంటే పరామర్శించేందుకు ఎందుకు వెళ్లడం లేదని విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం హరీశ్ రావు పర్యటించారు. ఎండిన పంటలను పరిశీలించిన.. అనంతరం రైతులతో మాట్లాడారు. ఎకరానికి రూ. 25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల దగ్గరకు వెళ్లి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ వందల రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Harish Rao : సీఎం గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు..రైతుల కోసం.!
రైతులకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ వందరోజుల పాలనలో 180 మంది రైతులు సూసైడ్ చేసున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం పర్యటించిన హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: