ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం ఈడీ ఆయనను రౌస్ అవెన్యూలో హజరుపరిచింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Delhi Liquor Scam: కేజ్రీవాల్ అరెస్టు.. ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్న ఇండియా కూటమి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్కుమార్కు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు ఆయన్ని కలవనున్నట్లు సమాచారం.
Translate this News: