RS Praveen Kumar: ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని గగ్గోలు పెట్టిన కాంగ్రేసు ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే రూ. 16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని అన్నారు. ఇంకా అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. వాటిని బడ్జెట్లలో చూపించరని అన్నారు. అప్పుడు కనీసం మౌళిక సదుపాయాలైనా వచ్చాయని, ఇప్పుడు వాటి ఊసే లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తుందని మండిపడ్డారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద కూడా ఏదీ దాచకుండా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..RS Praveen Kumar: కాంగ్రెస్ అప్పులపై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్. ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని.. దీనిపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Translate this News: