Sri Ganesh Joined Congress: లోక్ సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా తెలంగాణలో బీజేపీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి కంటోన్మెంట్ నేత శ్రీ గణేష్ రాజీనామా చేశారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మల్కాజ్ గిరి (Malkajgiri) ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెంది రెండో స్థానం లో సరిపెట్టుకున్నారు శ్రీ గణేష్.
పూర్తిగా చదవండి..Sri Ganesh: బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. కంటోన్మెంట్ కీలక నేత శ్రీ గణేష్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: