TDP Ticket War: మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికల జరగనున్న వేళ టీడీపీలో టికెట్ల పంచాయతీ షురూ అయింది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే రెండు విడతల్లో 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కాగా మిగిలిన 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను అలాగే 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి రెండు జాబితాల్లో టికెట్ రాని కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ రాక భంగపడ్డ కొందరిని బుజ్జగించే పనిలో పడింది టీడీపీ అధిష్టానం.
పూర్తిగా చదవండి..TDP Ticket War: టీడీపీలో టికెట్ల లొల్లి.. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ అనుచరులు. కదిరి టికెట్ ఆయనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్లోని బాబు నివాసం ఎదుట ఆలూరు టికెట్ను సుజాతమ్మకు ఇవ్వాలని కార్యకర్తలు నిరసనకు దిగారు.
Translate this News: