RS Praveen Kumar: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఎస్పీ (BSP) కేంద్ర సమన్వయకర్త, ఎంపీ రాంజీ గౌతమ్ కుమార్ ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పొత్తులపై వారు చర్చించనున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులపై కసరత్తు, సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతలు చర్చలు జరపనున్నారు. ఇటీవల తమ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు అంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. మాయావతి (Mayawati) అలా ట్వీట్ చేయడంతో తెలంగాణలో బీఎస్పీ బీఆర్ఎస్ నడుమ పొత్తు రద్దు అయిందంటూ వార్తలు వచ్చాయి.
పూర్తిగా చదవండి..RS Praveen Kumar: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?
కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, సీట్ల పంపకంపై ఇరు నేతలు చర్చించనున్నారు. అయితే పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Translate this News: