Janmat Polls Survey on AP Election Results: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సర్వేలు సంచలనంగా మారాయి. ఇప్పటికే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు ప్రకటించగా.. తాజాగా ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చేసిన సర్వే ను ‘జన్మత్ పోల్స్’ సంస్థ ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పగ్గాలను మరోసారి సీఎం జగన్ (YS Jagan) కైవసం చేసుకుంటారని పేర్కొంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ (YCP) అభ్యర్థులు 119-122 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. అలాగే టీడీపీ + జనసేన + బీజేపీ కూటమికి 49 – 51 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
పూర్తిగా చదవండి..AP Elections 2024: ఏపీలో ఆ పార్టీదే అధికారం.. మరో సంచలన సర్వే రిపోర్ట్
ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ సర్వే వెల్లడించింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 119-122 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 49 - 51 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Translate this News: