Kejriwal Comments On BJP : చాలామంది మగవాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పేరు జపిస్తున్నారు. దాన్ని మీరు సరిచేయాలి. మీ భర్తలు మోదీ పేరు జపిస్తే వాళ్ళకు రాత్రి చెప్పండి అని మహిళలకు సలహా ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ పార్టీ(AAP Party) అధినేత కేజ్రీవాల్(Kejriwal). ఢిల్లీలో మహిళా సమ్మాన్ సమారోహ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో మహిళలకు రూ.1000 పథకం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీ సీఎం(Delhi CM) మొదటిసారి మహిళలతో సంభాషించారు. ఇందులో ఆప్కు మహిళలు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అలా అని ప్రమాణం చేయాలని కేజ్రీవాల్ కోరారు. మీ సోదరుడు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీకి మద్దతు ఇచ్చే మహిళలకు కూడా ఈ విషయం చెప్పాలని కోరారు.
పూర్తిగా చదవండి..Delhi : అలా చేస్తే భోజనం పెట్టొద్దు… మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపు
ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారాలు మొదలుపెట్టేసాయి. నిన్న ఢిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమారోహ్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టొద్దని మహిళలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
Translate this News: