Sitaram Naik : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Election) వేళ నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మెల్లిమెల్లిగా ఖాళీ అవుతోంది. తెలంగాణ(Telangana) లో బీజేపీ(BJP) ఆపరేషన్ ఆకర్ష్(Operation Akarsh) మొదలు పెట్టింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ(BJP).. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను తమ పార్టీలోకి లాగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చింది కాషాయం పార్టీ. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్(Sitaram Naik) బీజేపీలో చేర్చుకునేందుకు మంతనాలు చేస్తోంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కేసీఆర్ తనకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని భావించిన సీతారాం కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..EX MP Sitaram Naik : బీఆర్ఎస్కు మరో షాక్… బీజేపీలోకి మాజీ ఎంపీ!
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను లాగేందుకు సిద్ధమైంది. గత కొంత కాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ సీతారాంకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. ఈరోజు కిషన్ రెడ్డి ఆయన్ను కలిసి బీజేపీలో చేరాలని కోరారు.
Translate this News: