Telangana BJP First List: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 అభ్యర్థులను ప్రకటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది బీజేపీ. తెలంగాణలో 17 సీట్లకుగాను ఏకంగా 9 పార్లమెంట్ సీట్ల ప్రకటనతో ఎన్నికలకు రెడీ అయింది. అయితే అందరూ అనుకున్నట్టే ఆదిలాబాద్ (Adilabad) సిట్టింగ్ సీటును పెండింగ్లో పెట్టింది అదిష్టానం. సిట్టింగ్ ఎంపి సోయంబాబురావుకు టికెట్ ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆ పార్లమెంట్ కాషాయసేనలో హైటెన్షన్ నెలకొంది. ఆదిలాబాద్ హాట్ సీట్ కావడం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు భారీ విజయాన్ని అందుకోవడంతో అందరి చూపును అకర్షిస్తోంది. అయితే ఆరునూరైనా సీటునాదేనని.. గెలిచేది కూడా నేనే అని కుండ బద్దలు కొడుతున్నారు బాబురావు (Soyam Baburao).
పూర్తిగా చదవండి..Lok Sabha Elections 2024: తొలి జాబితా ప్రకటన.. తెలంగాణలో బీజేపీకి షాక్ తప్పదా?
తెలంగాణలో 9 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మొదలైంది. తమ పేర్లను ప్రకటించలేదని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ లిస్టులో సోయంబాబురావు, రఘునందన్ రావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉన్నారు.
Translate this News: