Harshavardhan: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ డాక్టర్ హర్షవర్థన్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. న్యూడిల్లీలోని కృష్ణా నగర్లోని ఈఎన్టీ క్లినిక్లో వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఐదు పర్యాయాలు శాసనసభకు, రెండు పర్యాయాలు లోక్సభకు గెలిచిన హర్షవర్ధన్ ప్రస్తుతం ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే నిన్న బీజేపీ తొలి దశ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా హర్షవర్ధన్ పేరును ఆ జాబితాలో చేర్చలేదు. హర్షవర్ధన్కు బదులుగా ప్రవీణ్ ఖండేల్వాల్ను బీజేపీ నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాను ఎన్నికల రాజకీయాలను వదిలి వైద్య రంగంలోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Harshavardhan: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా…కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.!
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ లో పోస్టు చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. కృష్ణా నగర్లోని ఈఎన్టీ క్లినిక్లో వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.
Translate this News: