Andhra Pradesh: విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. గత నెల ఓ ఫొటోగ్రాఫర్ హత్య జరగగా.. ఈ మర్డర్ వెనుక షణ్ముఖ్ తేజ (19) ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 26న పోతిన సాయి పవన్ కల్యాణ్ అనే ఫొటోగ్రాఫర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు. చివరికి షణ్ముఖ్ తేజ అనే 19 ఏళ్ల యువకుడు ఈ హత్యకు కారణమని గుర్తించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఫొటోగ్రాఫర్ను హత్య చేసిన షణ్మఖ్.. కారణం ఇదే
విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రఫర్ సాయి విజయ్(23)ను షణ్ముఖ్ తేజ్(19) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.15 లక్షల విలువైన కెమెరాల కోసం ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న షణ్ముఖ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: