Subsidy On Fertilizers: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలను ఆకట్టుకునే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పథకాలను రూపొందిస్తోంది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో బీజేపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెరిగిన ఎరువుల ధరలతో సతమతమవుతున్న రైతులకు తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్ లో ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్బీఎస్ స్కీం కింద రైతులు పంటల్లో ఎక్కువగా వాడే పొటాషియం, ఫాస్ఫాటిక్ ఎరువులతో పాటు మరో మూడు రకాల ఎరువులపై సబ్సిడీని పెంచింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 24,420 కోట్లను కేటాయించింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎరువుల రాయితీని అందించనున్నట్లు మోడీ సర్కార్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 25 రకాల పొటాషియం, ఫాస్ఫాటిక్ ఎరువులపై సబ్సిడీని అందిస్తున్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Subsidy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్
పెరిగిన ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్న రైతులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గం భేటీలో ఖరీఫ్ సీజన్లో ఎరువులపై సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు కొంత ఉపశమనం లభించనుంది.
Translate this News: