బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగితే.. సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని ఇటీవల కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బడ్జెట్ నిధుల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం.. ఫైనాన్స్ కమిషన్కు కట్టుబడి ఉందని అన్నారు.
పూర్తిగా చదవండి..Nirmala Seetharaman: దేశ విభజన వ్యాఖ్యలపై నిర్మలా ఫైర్.. ఏమన్నారంటే
నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు.
Translate this News: