పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయకేతనం సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని అన్నారు. ఏపీని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దొంగలపై వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ‘ ఇది అధికారం కోసం పెట్టుకున్న పొత్తు కాదు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు మాతో చేతులు కలపాలి. హైదరాబాద్కు మించి మిన్నగా రాజధాని ఉండేలా అమరావతికి రూపకల్పన చేశాం.
పూర్తిగా చదవండి..Chandra babu Naidu: అధికారం కోసం కాదు.. వైసీపీ విముక్తి కోసమే పొత్తు : చంద్రబాబు
వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టి టీడీపీ-జనసేనను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Translate this News: