లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు.. గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలతోనే టచ్లో ఉంటున్నారు. ఇటీవల జరిగిన నాగర్ కర్నూల్ సన్నాహక సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. కొంతకాలంగా రాములు బీఆర్ఎస్ పార్టీతో అసంతృప్తిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన బీజేపీ నుంచి నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బీజేపీ అధిష్ఠానం రాములుకు టికెట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.
పూర్తిగా చదవండి..Nagar Kurnool: బీఆర్ఎస్కు షాక్.. బీజేపీలో చేరనున్న నాగర్కర్నూల్ ఎంపీ..
నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 2019లో నాగర్కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు.. బీఆర్ఎస్తో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆయన ఎంపీ పోటీ చేసే ఛాన్స్ ఉంది.
Translate this News: