PM Modi Mann Ki Baat Break for 3 Months: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెలలో చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ‘మన్కీ బాత్’ (Mann Ki Baat) పేరుతో రేడియో (Radio) ప్రసంగం చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ప్రధాని చేసే ఈ ప్రసంగం కోసం కోట్లాదిమంది ప్రజలు ఎదురుచూస్తుంటారు. దేశ పురోగతి, నూతన ఆవిష్కరణలు, ప్రభుత్వ ప్రోత్సహకాలు, సంక్షేమ పథకాలు లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన ప్రజలతో పంచుకుంటారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అదే ఏడాది అక్టోబర్ 10న ప్రధాని మోదీ మాన్కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇది విశేష ఆదరణతో ఇంకా కొనసాగతూ ఉంది. ఈనెల ఆదివారం నాటికి 110వ ఎపిసోడ్ పూర్తైంది. అయితే ఈసారి ప్రధాని కీలక విషయాలు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Mann Ki Baat: మాన్ కీ బాత్కు బ్రేక్ ఇస్తున్నా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు 'మాన్కీ బాత్' కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా మార్చిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Translate this News: