బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి అందరినీ తీవ్ర బాధలోకి నెట్టేసింది. మృతి వార్త తెలిసి సీఎంతో సహా అందరు నేతలూ స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తీవ్ర బాధను కలిగించిందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు. లాస్య ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆమె మృతికి సంతాపాన్ని తెలియజేశారు. లాస్య నందిత ఇంత చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాని తెలిపారు. వీరితోపాటూ మంత్రి ఉత్తమ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు కూడా లాస్య మృతికి సంతాపం తెలియజేశారు.
పూర్తిగా చదవండి..Telangana: ఎమ్మెల్యే లాస్యనందిత మృతి..సీఎం రేవంత్, నేతలు దిగ్భ్రాంతి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం రేవంత్తో పాటూ ఇతర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్లు కూడా సంతాపాన్ని తెలియజేశారు.
Translate this News: