AP Congress Called for Chalo Secretariat: ఆంధ్రాలో ప్రస్తుతం వాతావరణం చాలా వేడీ వేడిగా ఉంది. చలో సెక్రటేరియట్ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) పిలుపునివ్వడంతో అక్కడ అంతా టెన్షన్ నెలకొంది. చలో సెక్రటేరియట్ కోసం నిన్న రాత్రే విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్చేరుకున్న షర్మిల అక్కడే నిదురించారు. ఆమెతో పాటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తులు కూడా అక్కడే పడుకున్నారు. దీంతో అక్కడకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాంగ్రె నేతలు మస్తాన్ వలీ, రుద్రరాజుతో పాటూ మరి కొంత మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
మాకు నిరసన తెలిపే హక్కు లేదా..
Andhra Pradesh: ఏపీలో టెన్షన్ టెన్షన్..ఛలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
ఇవ్వాళ చలో సెక్రటేరియట్ కి ఏపీ కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు.
Translate this News: