Mylavaram YCP Ticket : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మైలవరం(Mylavaram) హాట్ టాపిక్ అవుతోంది. అటు టీడీపీ(TDP), ఇటు వైసీపీ(YCP) రెండు పార్టీల్లో ఇక్కడ టికెట్ కోసం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మైలవరం అభ్యర్ధిగా వైసీపీనే ఉంచి ముద్రబోయిన వెంకటేశ్వర్రావు(Muddaraboina Venkateswara Rao) ను అధిష్టానం ఖరారు చేసింది. నిన్న సీఎం జగన్ కలిసిన ముద్రబోయినకు మైలవరం సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మైలవరం ఇన్చార్జిగా ముద్రబోయినను అధిష్టానం ప్రకటించనుందని తెలుస్తోంది. టిడిపిలో తనకు అన్యాయం జరిగిందని రెండు రోజుల ముందు కార్యకర్తల ముందే కన్నీళ్లు పెట్టుకున్న ముద్రబోయిన.. వైసీపీ నుండి ఆఫర్ రావడంతో ఆ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మైలవరం ఇన్చార్జిగా ఉన్న సర్ణాల తిరుపతిరావు యాదవ్ ఉన్నారు. మరోవైపు ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి రావడంతో .. నూజివీడు ఎమ్మెల్యే ను అధిష్టానం పిలిపించింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : మైలవరం వైసీపీలో కొత్త ట్విస్ట్
మైలవరంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ని ఖరారు చేసింది. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని చెబుతున్న ముద్రబోయిన ఈరోజో రేపో వైసీపీలో జాయిన్ అవనున్నారు.
Translate this News: