KCR Delhi Tour: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనుండటం ప్రధాన్యం సంతరించుకుంది. అయితే ఈ వారంలోనే ఆయన హస్తినాకు వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాటి అక్రమాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్.. రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
పూర్తిగా చదవండి..KCR Delhi Tour: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈవారంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడటం, లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Translate this News: