Samajwad Party: లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. మరోవైపు మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీల మధ్య ఇప్పటికీ సీట్ల సర్దుబాటు కాలేదు. దీనికి తోడు.. కీలక నేతలైన ఢిల్లీ సీఎం అరవింద్ కెజ్రీవాల్, బిహార్ సీఎం నితిష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఇండియా కూటమిని వీడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగినట్లైంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ కీలక ప్రకటన చేసింది.
పూర్తిగా చదవండి..Samajwad Party: కాంగ్రెస్కు సమాజ్వాద్ పార్టీ ఆఫర్.. కానీ ఒక షరతు..
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు.. సమాజ్వాదీ పార్టీ ఓ ఆఫర్ను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ముందుగా కాంగ్రెస్కు 11 స్థానాలనే కేటాయించినప్పటికీ.. ఆ తర్వాత వీటి సంఖ్యను 17కు పెంచింది. ఈ ఆఫర్ను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని షరతు పెట్టింది.
Translate this News: