దేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ నిలిపివేసినట్లు.. ఆ పార్టీ నేతలు తెలిపారు. అంతేకాదు ఐటీ శాఖ వాళ్లు ఫ్రీజ్ చేసిన వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. పన్ను కట్టలేదనే కారణంతో అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో ఈ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. అయితే కాంగ్రెస్ ఈ ప్రకటన చేసిన గంట తర్వాత.. అధికారులు మళ్లీ ఖాతాలను పునురద్ధరించారు. ఈ అంశంపై ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్లో అప్పీల్ చేయడం వల్ల ఉపశమనం లభించింది.
పూర్తిగా చదవండి..Congress: కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్.. కారణం అదేనా..
లోక్సభ ఎన్నికల దగ్గరికొస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖాతాలు ఫ్రీజ్ కావడం కలకలం రేపింది. పన్ను చెల్లించలేదనే కారణంతో ఐటీ శాఖ తమ అకౌంట్లు నిలిపివేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ప్రకటన చేసిన గంట తర్వాత ఖాతాలను మళ్లీ పునరుద్దరించారు.
Translate this News: