Chinta Mohan: చిరంజీవికిం సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. చిరంజీవికి ఇదే మంచి అవకాశమని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరారు. ముఖ్యమంత్రి అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశమని.. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ఇప్పుడు రాకపోతే పదేళ్ల పాటు కాపులు, బలిజలకు ఏ అవకాశం దక్కదని తెలిపారు. ఏపీలో సీఎం జగన్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 10 సీట్లు లోపు వస్తాయని జోస్యం చెప్పారు. పాకిస్థాన్ కంటే ఘోరంగా ఏపీ రాజకీయాలు ఉన్నాయని..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నీ వర్గాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Chinta Mohan: చిరంజీవి సీఎం అయ్యేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. ఆయన సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అన్నారు. అలాగే ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు.
Translate this News: