Farmers Protest:ఢిల్లీ బోర్డర్లో రైతులు పట్టువదలడం లేదు. ఛలో ఢిల్లీ నిరసనను రాజధానిలో చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నిన్న మొదలుపెట్టిన ఈ ఆందోళన ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు శంభు సరిహద్దులో రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించటగా పోలీసులు వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు గాయపడ్డారని సమాచారం. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పగులగొట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పూర్తిగా చదవండి..Delhi:రైతుల మీద మరోసారి టియర్ గ్యాస్…ఉద్రిక్తంగా ఢిల్లీ బోర్డర్లు
ఢిల్లీలో బోర్డర్లలో రైతుల చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. రైతులు రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు మరొకసారి వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. శంభు సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.
Translate this News: