BCCI New Rule to Play IPL: ఐపీఎల్ అంటే ఆటగాళ్లకు కాసుల పంట. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు ఐపీఎల్లో రాణించి జాతీయ జట్టులోకి రావాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ఇందులో ఏ మాత్రం తప్పు లేదు.. డబ్బులు సంపాదించడం ఎవరికైనా అవసరమే. అయితే టీ20లు, టెస్టులు వేరు వేరు. అందుకే గతంలో రంజీ క్రికెట్ను ప్రతిభకు కోలమానంగా భావించేవాళ్లు. అయితే ఇప్పుడా రోజులు పోయినట్టే కనిపిస్తున్నాయి. అటు బీసీసీఐ కూడా ఐపీఎల్కే పెద్ద పీట వేస్తూ వచ్చింది. కానీ రిజల్ట్స్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదు ఫైనల్ లేదా సెమీస్లో చోక్ అవ్వడం ఇండియాకు అనవాయితీగా వస్తోంది. దీంతో బీసీసీఐపై విమర్శలు పెరిగాయి. సర్ఫరాజ్ లాంటి ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్ల్లో ఎంత ఆడుతున్నా తీసుకోవడం లేదని విమర్శలు గుప్పుమన్నాయి. ఇక బీసీసీఐ కూడా రంజీ టాలెంట్ని యూటిలైజ్ చేసుకోవాలని భావిస్తోంది. అయితే పలువురు ఆటగాళ్లు రంజీలు ఎగొట్టి ఐపీఎల్కు రెడీ అవుతున్నారని అర్థమవడంతో సీరియస్ అయ్యింది.
పూర్తిగా చదవండి..BCCI: రంజీలు ఆడితేనే ఐపీఎల్.. తిక్క కుదిర్చిన బీసీసీఐ!
రంజీలు ఆడితేనే ఐపీఎల్లో ఆడాలని పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ ఆడటానికి కనీసం 3-4 రంజీ మ్యాచ్లు ఆడాలని ఆదేశించినట్టుగా సమాచారం. ముఖ్యంగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతోంది.
Translate this News: