లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే తాజాగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం కొత్త స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద అబ్బాయిలకు ప్రతి ఏడాది రూ.9 వేలు, అమ్మాయిలకు రూ.10 వేల చొప్పున అందించనున్నారు. ఇక ఎస్సీ/ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ. 10 వేలు.. విద్యార్థినులకు రూ.11 వేల చొప్పున అందించనున్నారు.
పూర్తిగా చదవండి..Odisha: డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం కొత్త పథకం.. ఏటా రూ.9 వేలు సాయం
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం నూతన ఉన్నత అభిలాష (NUA)-ఒడిశా పేరుతో ఓ పథకం తీసుకురానుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.9 వేలు, విద్యార్థినులకు రూ.10 వేల చొప్పున అందించనున్నారు.
Translate this News: